Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Wattem Pumphouse: వట్టెం పంప్ హౌస్ మునక

–స‌ర్జిపూల్ నుంచి పోటెత్తిన వ‌ర‌ద‌ నీరు
— గోప్యత పాటించిన అధికారులు
–పంప్‌హౌజ్ నుంచి నీరు ఎత్తిపోసే చ‌ర్య‌లు

Wattem Pumphouse: ప్రజా దీవెన, , హైద‌రాబాద్‌: భారీ వ‌ర్షాల‌తో వ‌ర‌ద ప్ర‌వాహం పోటెత్తుతోంది. చెరువులు అలుగు పారు తుండ‌డంతో కాల్వ‌ల ఉప్పొంగి ప్ర‌వహిస్తున్నాయి. ఇక‌ పాలమూ రు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తా గునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పీఆర్‌ఎల్‌ఐ పథకంలోని వ‌ట్టెం పంప్‌హౌస్ (Wattem Pumphouse) నీట మునిగింది. నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్‌హౌస్‌లోకి వ‌ర‌ద నీరు చేరింది. ప్యాకేజీ-7లోని ఆడిట్‌ ( Audit in Package-7) నుంచి పంప్‌హౌస్‌ సొరం గమార్గంలోకి నాగనూలు, నాగర్‌క ర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది.

వట్టెం పంపింగ్‌ స్టేషన్‌లో (Wattem Pumping Station) మొత్తం 10 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు నాలుగు మోటార్లు బిగించారు. మరో మోటారు నిర్మా ణ దశలో ఉంది. భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని గొలుసుక ట్టు చెరువులు భారీ వరదతో పొంగి పొర్లాయి. తూడికుర్తి, శ్రీపురం, నాగ నూలు చెరువులు నిండి అలు గు పారాయి. ఈ చెరువుల (of ponds) సమీ పంలో పీఆర్‌ఎల్‌ఐ పథకం టన్నెల్ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన మార్గం మీదుగా ఈ చెరువు ల వరద నీరు సర్జిపూల్‌లోకి వచ్చి.. గేట్ల ద్వారా పంపుహౌస్‌లోకి వెళ్లిం ది. దీంతో భారీగా నష్టం వాటిల్లిన ట్లు తెలుస్తోంది. ఈ విషయాలు బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచిన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం డీ వాటరింగ్‌ చేస్తున్నారు. ఈ నీళ్లన్నీ బయటకు వెళ్లిపోతే ఎం త మేర నష్టం వాటిల్లిందో స్పష్టత రానుంది.