Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srinivasa Reddy: ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ మా లక్ష్యం

— మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

Srinivasa Reddy: ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే మా లక్ష్యమని మహ బూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Srinivasa Reddy) స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా లో ఎన్న డూ లేనివిధంగా 12.1 సెంటీమీ టర్ల వర్షపాతం నమోదైంది. దీనితో అంతకుముందు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరిక మేరకు జిల్లాలోని ప్రతి శాఖ అధికారులను మరియు ప్రజాప్రతినిధులను సమాయత్తం చేయడం జరిగింది. అందుకే 1వ తేదీన ఉదయం మే 4 గంటలకు పుర చైర్మన్ ఆనంద్ గౌడ్ (Chairman Anand Goud)మరియు అన్ని శాఖల అధికారులకు, కౌన్సి లర్ లకు ప్రతి వార్డు లో పర్యటిం చి ప్రజలకు మనోధైర్యం కల్పించా లని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

వారు కూడా ప్రజలకు ఉదయం నుంచే అందుబాటులో సాయంత్రం దాకా ప్రజలకు కావా ల్సిన అవసరాలను తీర్చేందుకు తమ శక్తి కొలది సహాయం చేశా రని, భారీగా జరగాల్సిన నష్టాన్ని తగ్గించేందుకు అన్ని శాఖల అధి కారులు చేసిన కృషి అభినంద నీయం అని ఆయన అన్నారు. గతంలో నమోదైన వర్షపాతం 9 సెంటీమీటర్ల మాత్రమే నమోదైన ట్లు అధికారుల ద్వారా తెలిసింది అని, ఆ రిపోర్టులు కూడా తెప్పిం చుకోవడం జరిగిందని, కానీ గతం లో భారీగా నష్టం జరిగింది అని ఆయన స్పష్టం చేశారు. కొత్త చెరువు చుట్టూ ఉన్న డ్రైన్ లను పూర్తిచేసి ఉంచడంతో పాటుగా అక్కడ అక్కడా మిగిలిపోయిన డ్రైన్ పనులను (Drain works) పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు జారీచే శామని, భవిష్యత్తు లో వరదలు రాకుండా , రానున్న అమృత్ పథకంలో వచ్చే నిధులను పక్కా ప్రణాళిక తోటి రానున్న 2-3 సంవత్సరాల లో తాగు సాగు నీరు సమస్యలు రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలి పారు. గత పాలకులు తప్పుల తడకగా వేలకోట్ల రూపాయలతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో ప్రజల దాహార్తిని తీర్చ లేకపోయారని ఆయన మండి పడ్డారు.

అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే తాగునీటి కోసం 1600 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశా రని , మహబూబ్ నగర్ జిల్లా కు 110 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, మా ప్రభు త్వం ఏదో ఒకటి చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి, మోసం చేయా లనుకోవడం లేదని, వ్యవసాయం తాగునీరు అలాగే విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మొన్న వచ్చిన భారీ వరదలకు (flodds) ఎక్కువ నష్టం జరుగకుండా ఉండేందుకు పుర ప్రముఖులు, ప్రజలు, యువత, అన్ని శాఖల అధికారులు కలిసి కట్టుగా పనిచేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రజలకు సహాయం చేశారని అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన చర్యలు తీసుకొనే పూర్తి స్వేచ్ఛ, అధికారం రెవెన్యూ అధికారులకు (To Revenue Officers)ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏవిధంగా అయితే చెరువులు కుంటలు ఆక్రమించిన వారిపైన చర్యలు తీసుకుంటున్నారో అలాగే ఇక్కడ కూడా అలాగే ఉంటుందని, ప్రభుత్వ భూముల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండరాదని ఆయన తేల్చిచె ప్పారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, నాయ కులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొ న్నారు.