Amit Shah is coming..!అమిత్ షా వస్తున్నారు..!
--ఈనెల 27న ఖమ్మం జిల్లాలో పర్యటన -- విస్తృత ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు
అమిత్ షా వస్తున్నారు..!
—ఈనెల 27న ఖమ్మం జిల్లాలో పర్యటన
— విస్తృత ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు
ప్రజా దీవెన/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, హోoమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ నెల 27న ఆదివారం తెలంగాణ పర్యటనకు వస్తున్న ఆయన అదే రోజు సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇక మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.27న ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి భద్రాచలం దేవాలయం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు వస్తారు. అక్కడి నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
అనంతరం అక్కడ జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరానికి చేరుకుని సాయంత్రం 6.20 గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.