–విద్యారంగం సంక్షేమానికే తొలి ప్రాధాన్యత
–ఆత్మగౌ రవానికి ప్రతీకలుగా సంక్షే మ పాఠశాలలు, హాస్టళ్లు నిలవాలి
–ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారు
–ఉద్యోగులు విద్యార్థులను తమ సొంత పిల్లల చూసుకోవాలి
–గిరిజన విద్యాసంస్థల సేవలపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్
Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యార్థుల సంక్షేమానికి తమ ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుం దని మంత్రి సీతక్క (Sitakka) స్పష్టం చేశారు. విద్యా రంగంలో పదేళ్లుగా పెండిం గ్లో ఉన్న ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తున్నట్లు చెప్పా రు. అస్తిత్వానికి, అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా సంక్షేమ పాఠశాలలు, హాస్టల్లు నిలవాలని ఆకాంక్షించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టల్లు, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన, మౌలిక వసతులు, భోజన వసతి (In tribal ashram schools, hostels, gurukula institutes, education, infrastructure, food and accommodation)తదితర అంశాలపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. శరత్ తో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. st గురుకులాల కార్యదర్శి సీతా లక్ష్మి, గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఐటిడిఏ po లు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, DDTO, ATDO, అన్ని రకాల గిరిజన విద్యా సంస్థ ల ప్రిన్సిపాల్ లు, హాస్టల్స్ వార్డెన్స్ తదితరులు దాదాపు 850 మంది హాజరైన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ..విద్యార్థులే తమ ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించేలా అంతా కృషి చేయాలని కోరారు. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామన్నారు. ఇంకా బోధన, ఇతర సిబ్బంది సమస్యలు వుంటే పరిష్కరిస్తామన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు (Strict measures) తప్పవని హెచ్చరించారు.
వర్షాకాలంలో టీచర్లు, వార్డెన్లు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని మంత్రి సీతక్క (Sitakka)సూచించారు. విద్యార్థులు హాస్టల్ విడిచి వాగుల వద్దకు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలని చెప్పారు. విద్యార్థులు జ్వర బారిన పడితే ఇంటికి పంపకుండా వసతి గృహల్లోనే మెరుగైన వైద్యం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకున్నప్పుడే.. మీ పిల్లలను దేవుడు మంచిగా చూస్తాడని చెప్పారు. అమ్మ ఒడిలా, సొంత ఇంటిలా విద్యార్థులు భావించే స్థాయిలో హాస్టల్స్ (Hostels) ను తీర్చిదిద్దాలని సూచించారు.
నాణ్యమైన వేడి బోజనాన్ని, వేడి చేసి చల్లార్చిన తాగు నీటి ని విద్యార్థులకు అందజేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆహార మెనూను వసతి గృహాల్లో తప్పకుండా అమలు పరచాలన్నారు. హాస్టల్ కి సరుకుల సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థుల బోజన అవసరాల కోసం టీచర్లు (teachers) ఖర్చు చేయాల్సి వస్తే.. ఆ నిధులను ఐటీడీల ద్వారా ప్రత్యేకంగా చెల్లించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకే ఖర్చుకి వెనకాడకుండా.. విద్యార్థుల భాగోగులే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు.
చిన్న చిన్న సమస్యలను బూతద్దం లో పెట్టీ చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసేది టీచర్ లేనని..అందుకే మానవత్వాన్ని జోడించి మంచి విద్యను, నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. ఉన్నతాధికారులు st విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శించాలని సూచించారు. ప్రతిరోజు డ్యూటీ టీచర్ ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. S T సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉందని, అందుకే ఎస్ టి విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. శాఖ కార్యదర్శి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఓకే కుటుంబంగా పని చేసి గిరిజన విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలన్నారు మంత్రి సీతక్క.