–మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
MLA Lakshmareddy: ప్రజా దీవెన, దామరచర్ల: యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టు పరిధిలో భద్ర తా చర్యలు మరింత పటిష్ట వంతం గా చేపట్టాలని మిర్యాలగూడ శాస నసభ్యుడు లక్ష్మారెడ్డి (MLA Lakshmareddy) స్పష్టం చేశా రు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్నత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవర్ ప్లాంట్ (Power plant) లో చోరీ జరగడం ఇది రెండవ సారి భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యాని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
దీనికి కారణం అయిన ప్రతిఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకుంటామ న్నారు. అలాగే మరోసారి ఇలాంటి సంఘ టనలు జరగకుండా భద్రతా చర్య లు బలంగా ఉండాలి అని అధికా రులకు సూచించారు. ఇది ప్రభు త్వం ఖజానా (Government treasury)అంటే ప్రజలది ప్రజల ధనాన్ని దొచ్చుకోకుండా కాపాడా ల్సిన బాధ్యత అధికారులది అంటే మనదే గత పాలనలో జరిగిన పొర పాట్లను జరగకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు.. మరో సారి ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతిఒక్కరిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యా లగూడ డిఎస్పి రాజు, పవర్ ప్లాంట్ ఎస్ ఈ, ఇతర ఉన్నత అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.