మానవత్వం మంటగలిచిన వేళ..!
—భార్య అరచేయి నరికిన కిరాతక భర్త
— దేశ రాజధాని ఢిల్లీలో సంఘటన
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: భార్య ప్రభ్వుత్వ ఉద్యోగి కానీ ఆమె ఉద్యోగం చేయడం భర్తకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇంతకీ ఆ భర్త ఎవరనుకుంటున్నారు అతనొక ప్రభుత్వ ఉద్యోగి కావడం విశేషం. అందులోనూ దేశ రక్షణలో కర్తవ్యo నిర్వర్తించే సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్.
ఇంతకీ జరిగిందేమిటoటే ఉద్యోగోన్నతి కోసం అర్హత పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ గదిలో ఉంది. ఆ సమయంలో మానవత్వం మరిచిన భర్త అక్కడికి చేరుకొని ఆమె అర చేయి నరికేసి పారిపోయాడు. ఈ హృదయ విదారక సంఘటన ఢిల్లీలో జరిగింది.
సంఘటన పూర్వాపరాలు ప్రకారం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ 32 ఏళ్ల సతీష్ కుమార్ కుష్వాహా సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి 28 ఏళ్ల భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్ కు ఇష్టం లేకపోవడం ఒక ఎత్తైతే ఆమె ప్రమోషన్ కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వచ్చింది.
ఆదర్శ్ నగర్ లోని ఓ చిన్న హోటల్ లో వీరిద్దరి మధ్య ఉద్యోగం విషయంలో ఘర్షణ జరిగింది. వివాదం సద్దుమణిగిన తర్వాత హోటల్ సిబ్బంది ద్వారా ఈ జంట భోజనం కూడా తెప్పించుకున్నారు. ఈ క్రమంలో భార్యకు తెలియకుండా సతీష్ అందులో మత్తు మందు కలిపగా ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను మంచానికి కట్టేసి, దారుణంగా అరచేయి నరికాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోగా తీవ్ర నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చి లేచి చూసి తన పరిస్థితి అర్థం చేసుకొని గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, బాధితురాలిని సఫ్దర్జంగ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు గంటల తరబడి ఆపరేషన్ చేసి, ఆమె చేతిని తిరిగి అతికించారు.
ఈ ఘటపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్ వెస్ట్) జితేంద్ర కుమార్ మీనా తెలిపారు. కాగా నిందితుడు గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుoడగా ఆ దాడి విషయంలో అతడితో పాటు సోదరుడిపై కూడా అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు.