–తెలంగాణ తల్లిగా ప్రకటించాలి
–చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్
Chakali Ailamma: ప్రజా దీవెన, తెలంగాణ (Telangana) సాయుధ రైతాంగ పోరాట వీరనారి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత చాకలి ఐలమ్మ (Chakali Ailamma) పేరును కోఠి (Koti) లోని కోటి ఉమెన్స్ యూనివర్సిటీ (women’s University) కి ఐలమ్మ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించడం పట్ల చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్ కో-ఆర్డినేటర్ పగిళ్ల సందీప్ మాట్లాడుతూ.. భూస్వాములకు వ్యతిరేకంగా దేశ్ముఖ్ ఆగడాలపై తిరుగుబాటు బహుట చాకలి ఐలమ్మ నాడు ఆంధ్ర మహాసభ ప్రేరణతో చాకలి ఐలమ్మ చేసిన భూ పోరాటం వల్ల అనేక మంది పేదలకు భూమి లభించింది.
నేడు తెలంగాణలో ప్రజా ఉద్య మాలకు చాకలి ఐలమ్మ ప్రేరణ ఇచ్చింది. అదేవిధంగా., తెలంగాణ ప్రభుత్వము నిర్వహణ తలపెట్టిన సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడతానన్న ఆలోచన గొప్ప విషయం. ఆ తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మగా గుర్తించి తెలంగాణ తల్లిగా ప్రకటించాలని కోరారు. చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులలో ఒకరైన ఐలమ్మ ముని మనుమరాలు చిట్యాల శ్వేత ఐలమ్మకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ హర్షం వ్యక్త పరుస్తుంది. నేటి యువత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని.. ఈ సందర్భంగా నాగిళ్ళ శంకర్, పగిళ్ల సందీప్ లు అన్నారు.