Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Runamafi: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రుణమాఫీ కాని రైతుల సంఘం

Runamafi: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాఫీ కానందున్న సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy)కి రైతుల సంఘం లేఖ రాసింది. రుణమాఫీ (Runamafi) అవుతుందో లేదోననే ఆందోళనతో కొంత మంది రైతులు ఆత్మహత్యలు (Suicides) చేసుకుంటున్నారు.

రెండు లక్షల కన్నా అధికంగా ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ అన్న నిబంధనతో రైతులు (Farmers) దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి చేసుకున్న రైతులు.