Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: నిమజ్జనంలో జాగ్రత్త చర్యలు

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)కోరారు. సోమవారం అయన అనుముల మండలం హాలియా 14వ మైలురాయి వద్ద ఆయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ (Sarat Chandra Pawar) తో కలిసి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే చోట నీటిలో ప్రమాదం జరగకుండా విగ్రహాలు తీసుకొచ్చిన వారితో నిమజ్జనం చేయించకుండా,, జిల్లా యంత్రాంగం ద్వారా ఏర్పాటు చేసిన వారి ద్వారానే నిమజ్జనం చేయించాలని ఆయన ఆదేశించారు.

నిమజ్జనం నిర్వహించే చోట గజ ఈత గాళ్లతోపాటు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, (Revenue, Police,)అలాగే విధులకు నియమించబడిన అన్ని శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రథమ చికిత్స (first aid)కిట్లతోపాటు, ఓ ఆర్ ఎస్ ద్రావణం ప్యాకెట్లు (ORS solution packets)సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు .నిమజ్జనం జరిగే ప్రదేశంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. తహసీల్దా ర్,ఎం పిడివో,ఇతర అధికారు లు,తదితరులు ఉన్నారు.