FCI: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారత ఆహార సంస్థ (Food Corporation of India) నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరుపబడుతున్న స్వచ్చత యే సేవ (seva కార్యక్రమంలో భాగంగా, సంస్థ ఉద్యోగులు గురువారం స్వ చ్చత ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ AGM (QC) డా. రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల స్వప్నమైన వికసిత భారత సాధన కు స్వచ్ఛ భారతమే ముఖ్య సోపా నమని అభిప్రాయపడ్డారు. రామగి రి లోని సంస్థ జిల్లా కార్యాలయం నుండి ఉద్యోగులు క్లాక్ టవర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారు లు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, బిల్ల శ్రీనివాసరావు, కె కె షా, జయ కుమార్, పట్నాయక్, సుకుమార్ మరియు సెక్షన్ ఉద్యోగులు సతీష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొ న్నారు.