Canopy Foundation: ప్రజా దీవెన, కోదాడ: పందిరి ఫౌండేషన్ (Canopy Foundation) కోదాడ ఆధ్వర్యములో శనివారం మునగాల మండలం ముకుందాపురం గ్రామం లో ఇమ్మడి మోహన్ రావు, లీలావతి (Immadi Mohan Rao, Lilavati) ల జ్ఞాపకార్థం పదిహేనువేల రూపాయల విలువగల సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామం లోని పోస్టు ఆఫీస్ వద్ద, వాటర్ ట్యాంకు వద్ద మరియు శివాలయం వద్ద పాదచారుల, వృద్ధుల, వికలాంగుల, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి (Panthri Nagireddy)మాట్లాడుతూ గ్రామం లో ముందు ముందు మరిన్ని బెంచీలు ఏర్పాటు చేస్తామని, ప్రజాసేవలో ఫౌండేషన్ ముందుంటుందని, నియోజకవర్గ స్థాయిలో సేవలు విస్తృత పరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, కార్యదర్శి ఇమ్మడి సతీష్ బాబు, గౌ సలహాదారులు సేకు శ్రీనివాసరావు, సభ్యులు బారీ వెంకన్న, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, చిన్న నర్సయ్య, వెంకట్ రెడ్డి, తుమ్మల శ్రీను, తాళ్ళపాక సైదులు, బాబు నాయక్, శనగని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.