Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: నమ్మిన సిద్ధాంతoతో నిలబడిన యోధుడు ఏచూరి

— మౌనం అతి పెద్ద‌ ప్ర‌మాదమన్న ఏచూరి జీవన విధానం మాకు మా ర్గ‌ద‌ర్శకం
— ఏచూరి సంస్మరణ సభలో మాజీ మంత్రి కేటీఆర్

KTR: ప్రజా దీవెన, హైద‌రాబాద్: రాజకీ యాల్లో ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయిం పుల కాలంలో ఒకే పార్టీలో ఏచూరి నిలబడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం జ‌రిగిన సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూ రి (Comrade Sitaram Yechury) సంస్మరణ సభలో ఆయన మా ట్లాడుతూ సిద్ధాంతం చుట్టూ నిల బడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని కొనియా డారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం పోరాడా రని తెలిపారు.ప్రశ్నించడమే ప్రజా స్వామ్యమ‌ని (Praja Swamyamani)నమ్మిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు.

పార్టీలు సిద్ధాంతా లు వేరుకావొచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మాది రక్త సంబంధం అన్నారు.ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మౌనంగా ఉండటం ప్రమాదమ‌ని ఏచూరి చెప్పారని వెల్లడించారు. ఏచూరి చెప్పిన సిద్ధాంతాలతో ప్రజాస్వా మ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మేము పోరాడుతామ న్నారు. సీతారాం ఏచూరి (Comrade Sitaram Yechury) జీవితం త‌మ లాంటి యువతరానికి స్పూర్తిదా యకమని తెలిపారు. సీపీఎం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి కేటీఆర్, ఎంఎల్సీ కోదండరాం, ప లువురు సీపీఎం నేతలు హాజర య్యారు.