–విద్యార్థుల సన్మార్గంలో బాధ్యత ఉపాధ్యాయులదే
–భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో పనిచేస్తూ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవా ర్డులు అందుకున్న 18 మంది ఉ పాధ్యాయులకు మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సమావేశాన్ని ఉద్దెశించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy)మాట్లాడుతూ నవ సమాజ నిర్మాతలే ఉపాధ్యాయు లు, విద్యార్థులను సన్మార్గంలో నడి పించే బాధ్యత ఉపాధ్యాయులదే అని పేర్కొన్నారు.సమాజంలో ఉ పాధ్యాయుల పాత్ర గొప్పది విద్యార్థులను భావి భారత పౌరు లుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి మ (Teaching profession)హోన్నతమైనదని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల (State Govt Schools) బలో పేతం కోసం అన్ని చర్యలు చేపడు తుందని అన్నారు. సామాజిక రుక్మ ధులను రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు.గత పది సంవ త్సరాలనుండి నిర్వీర్యం అయిన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసే దిశగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అ న్నారు. ఉపాధ్యాయులు అంటే కేవలం గురువులే కాదు విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దే దర్శకులు గుర్తుచేశారు. విద్యార్థులకు సబ్జెక్ట్ లతో (Subjects for students) పాటు వారిలో దాగి ఉన్న నై పుణ్యాలను గుర్తించి ఆ దిశగా ప్రో త్సహించాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అం దుకున్న ఉపాధ్యాయులను అభి నందించారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయు లుగా ఎంపికైన వారి ని సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి నాగయ్య, ఎంఆర్ ఓ యా దగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి ఉపా ధ్యాయులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.