TTD: ప్రజా దీవెన, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమై న లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన టీటీడీ ఆ క్రతువులో భాగంగా తొలుత మహా శాంతియాగాన్ని నిర్వహించాలని శనివారం నిర్ణ యించింది. మూడు రోజులపాటు ఈ క్రతువు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు శాంతియాగాన్ని జరపనున్నారు. వేదపండితులు, రుత్వికుల నడుమ (Among Vedic scholars and Rutviks) శ్రీ వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
సంప్రోక్షణకు సీఎం ఆదేశా లు..
తిరుమల శ్రీవారి వారి లడ్డూలో (laddu) వాడకూడని పదార్థాలను విని యోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ ఈవో, అధికారులతో (TTD EO with officials)శుక్రవారం రెండుసార్లు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముందు గత వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ (laddu making)తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడ కంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లడ్డూ తయారీ (laddu making) విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వా లని టీటీడీ ఈవో శ్యామలరావును సీఎం ఆదేశించారు. తిరుమల పవి త్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. భక్తు ల విశ్వాసాలను, ఆలయ సాంప్ర దాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధివిధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది.