Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Blood Donation: మెగా రక్తదాన శిబిరం

*రక్తదాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని సీఐ పిలుపు
Blood Donation: ప్రజా దీవెన, కోదాడ: రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ ప్రమాదవశాత్తు చికిత్స పొందుతున్నప్పుడు కానీ రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం (Blood Donation) చేసి ప్రాణాలు కాపాడాలని కోదాడ పట్టణ సీఐ రాము పిలుపునిచ్చారు యునైటెడ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ మున్సిపల్ పరిధిలోని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని (Blood donation camp)ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు వందమంది యువకులు రక్తదానం శిబిరంలో (Blood donation camp) పాల్గొని రక్తాన్ని దానం చేశారు అనంతరం సీఐ రాము మాట్లాడుతూ అన్ని దానముల కంటే రక్తదానం గొప్పదని ప్రతి ఒక్కరూ యువకులు రక్తదానాన్ని చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా యునైటెడ్ ముస్లిం యూత్ ను ఆయన అభినందించారు.