Konda Surekha: ప్రజా దీవెన, హైదరాబాద్: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి (Jogulamba Bala Brahmeswara Swami) దేవస్థానంలో నిర్వహించే జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు అటవీ, పర్యావరణ, దేవాదయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకు లు ఆనంద్ శర్మ మంత్రి సురేఖ హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సంద ర్భంగా మంత్రి సురేఖకు అమ్మవారి శేష వస్త్రాలు, చీరె (Remainder of clothes, saree)సమర్పించి తీర్థప్రసాదాలను అందించి, వేదాశీ ర్వచనం చేశారు. బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను మంత్రి ఆవిష్క రించారు.తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాం బ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభ వోపేతంగా నిర్వహించేందుకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆలయ ఈవోను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam)హాజరయ్యే భక్తులకు అన్ని సౌక ర్యాలను కల్పించేందుకు ప్రణా ళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రసాద్ స్కీం నిధు లతో నిర్మించిన నూతన భవనంలో భక్తులకు అన్నదానం, వసతీ కల్పిం చే దిశగా చర్యలు చేపట్టాలని నిర్దే శించారు. జోగులాంబ దేవాలయం లో అక్టోబర్ 3 నుండి 12 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి మహో త్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున మంత్రి సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమ ర్పించనున్నారు.