Chityala Municipal Commissioner: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చిట్యాలలోని G.O.M.S. 60 ప్రకారం 52 మంది మున్సిపల్ కార్మికులందరికీ రూ. 26 వేల చొప్పున తక్షణం జీతాలు పెం చాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (Joint Collector)కు వినతి పత్రం సమర్పించారు. చి ట్యాల మున్సిపాలిటీలో కేవలం 10 మంది బిల్ కలెక్టర్లు సూప ర్వైజర్లకు 5500 రూపాయలు, పదిమంది దినసరి కూలీల పేర 1500 రూపాయల జీతం పెంచి, తక్కిన 32 మంది స్వీపర్లు డ్రైవర్లకు (Sweepers are drivers)మొండి చేయి చూపి, మున్సి పల్ చైర్మన్ కు, పాలకవర్గానికి సంబంధం లేకుండా ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ వీరేందర్ (Municipal Commissioner Virender) ను తక్షణం సస్పెండ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క జీవో నెంబర్ 60 ప్రకారం సంవత్సరానికి 30% జీతం పెరగాలని ఉన్నందున తక్షణం చిట్యాల మున్సిపల్ కార్మికులైన 52 మందికి 26,000 చొప్పున జీతాలు పెంచాలని, పెంచని పక్షంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సమ్మె పోరాటం నిర్వహిస్తామని” ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.
నల్లగొండ జిల్లా కలె క్టరేట్ లో జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ (Bodies Additional Collector)కు మెమో రాండాన్ని అందజేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చి ట్యాల మున్సిపాలిటీ పాలకవ ర్గానికి సంబంధం లేకుండా కొందరికి జీతాలు పెంచడం మరికొందరికి ఆపడం ఇది అప్రజాస్వామీకం, అన్యాయం. ఇటువంటి చర్యలకు మున్సిపల్ కమిషనర్ ఒడిగట్టి ఈ విధంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తే పెంచిన వారివి ఆపేసి ఇబ్బందిక రంగా వ్యవహరిస్తున్న నేపథ్యం ఉంది అందుకోసం కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవా ల్సిందిగా కోరుతున్నా ము. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో (State Govt workers) వెట్టి చేయించు కుం టూ అతి తక్కువ వేతనాలనిస్తూ, మున్సిపల్ కార్మి కులను దోపిడీ చేస్తున్నారు. జీ.వో. నెంబర్ 60 ప్రకారం ప్రతి ఏటా 30% జీతం పెంచాలని, 3 సంవ త్సరాలుగా జీతాలు పెరగని చిట్యాల మున్సిపల్ కార్మికులకు తక్షణం 26,000 పెంచకపోతే ఈనెల సమ్మెలోకి వెళ్తామని” ఆయ న అన్నారు.ఆయనతో పాటు ప్రజా పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ వరికల్ గోపాల్ ప్రజాపతి, జి ల్లా నాయకులు మారగోని శ్రీనివాస్ గౌడ్, ఉయ్యాల లింగస్వామి గౌడ్, నాగిళ్ల యాదయ్య వీరితో పాటు మున్సిపల్ కార్మికులు ఉన్నారు.