ఫీజుల నియంత్రణకు నిర్ణయం
— హైకోర్టు ఆదేశాలతో మెమో జారీ
ప్రజా దీవెన/హైదారాబాద్: తెలంగాణలో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాలతో మెమో జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
గవర్నింగ్ బాడీ ద్వారానే ఫీజులు నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేస్తూ వసూలు చేసిన ఫీజులో 5% మాత్రమే లాభం తీసుకోవాలని హెచ్చరించింది ప్రభుత్వం. 50% సిబ్బందికి జీతాలు ఇవ్వాలని 15% ఫీజు స్కూల్ నిర్వహణకు వాడుకోవాలని, ఫీజుల వివరాలను స్కూల్ వెబ్ సైట్లలో డైరెక్టరేట్ వెబ్ సైట్లో పెట్టాలని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఐజీసీఎస్ఈ స్కూళ్లలోనూ ఫీజులు నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. హైకోర్టు కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వo మెమో ఇచ్చి చేతులు దులుపుకుందని, చట్టం ద్వారానే ఫీజులను నియంత్రించోచ్చని తల్లి దండ్రులు అభిప్రాయపడుతున్నారు.