Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

World Tourism Day: ప్రపంచ శాంతికి పర్యాటక రంగం కృషి చేయాలి

World Tourism Day: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: / మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యం, టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో విభాగ అధిపతి డా మారం వెంకటరమణా రెడ్డి (Maram Venkataramana Reddy)అధ్యక్షతన ప్రపంచ పర్యాటక దినోత్సవ (World Tourism Day) సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ చల్లేటి ప్రభాకర్ పర్యాటక రంగంలో వివిధ హోదాల్లో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లలు లేని పరిమితులు ప్రతిబంధకాలు లేని మానవ సమాజం స్వేచ్ఛ విహంగాలుగా విహరించి సంస్కృతి సాంప్రదాయాలను (Cultural traditions) నలుచెరగల వ్యాప్తి చేసి ప్రపంచశాంతికి దోహదపడాలని కోరారు. పర్యాటక రంగం ఉపాధి అవకాశాలతో పాటు, మానసిక ఉల్లాసానికి, ఆర్థిక అభివృద్ధికి, మౌలిక వసతుల పెంపునకు దోహదపడుతుందని అన్నారు. ప్రజల అభిరుచుల మేరకు వినూత్నమైన వ్యాపార పద్ధతులకు భారతీయ విలువలను జోడించి మహోన్నత మానవ సమాజానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మేనేజ్మెంట్ డీన్ ఆచార్య బి సరిత, బి ఓ ఎస్ డా మిరియాల రమేష్, డా లక్ష్మీ ప్రభ, శ్వేత, జ్యోతి, స్వప్న, కిరణ్మయి, నీరకంఠం శేఖర్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.