Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Oil Rates: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Oil Rates: ప్రజా దీవెన, హైదరాబాద్: భారీగా పెరిగిన ధరలతో సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. దసరా పండుగకు ముందు నిత్యావస రాల ధరలు ఒక్కసారిగా ఆకాశా న్నంటాయి. నూనె ధరలు లీటర్‌పై (oil) రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం (ginger) కిలో రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి ధరలూ (Onion prices) కేజీ రూ.60కి తగ్గడం లేదు. నిత్యావసరాల ధరలు భారీగా పెరడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.