Inter Board: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు సం బంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board)కీలక అప్డేట్ ఇచ్చింది. జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రభు త్వం పొడిగించింది.ఈ మేరకు ఇం టర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా (Shruti Oja) శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు(Government, aided, private, model schools, KGBVs,), గురు కుల జూనియర్ కళాశాలల్లో ప్రవే శాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్ ప్రథమ సంవ త్సరంలో ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఆలస్య రుసుం రూ.500 చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వరంగ జూని యర్ కాలేజీలకు ఆలస్య రుసుం నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు.
అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులకు(For students), చేర్పిం చాలని తల్లిదండ్రు లను కోరారు. ఆ కాలేజీల జాబితాను వెబ్సైట్లో (Website)పొందుపర్చామని వివ రించారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని సూచించారు. విద్యార్థుల కు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రవేశా లను కల్పించాలని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశిం చారు..