Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: కీర‌వాణికి థాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

Pawan Kalyan: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ‌వ్యాప్తంగా తిరుమల శ్రీవారి ప్ర‌సాదం లడ్డు వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌ హారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ముందుండి ప్రభుత్వం తరపున, సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష (Atonement initiation) కూడా చేపట్టారు. తాజాగా నారా యణుని స్మరణ కోసం ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం సులువు గా పఠించేందుకు అనువుగా సంగీ త దర్శకుడు కీరవాణి ప్రత్యేకంగా చిన్న ఆడియోను రూపొందించా రు. దాంతో కీరవాణికి (Kiravani)జ‌న‌సేనాని ప్రత్యకంగా ధ‌న్య‌వాదాలు తెలుపు తూ ఒక లేఖను విడుదల చేశారు.

” ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణికి (Kiravani) మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ధార్మిక విశ్వాసా లు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ (Om Namo Narayana)మంత్రం పఠిస్తు న్నారు. అందుకు అనువుగా కీరవా ణి ఆడియో రికార్డు చేశారు. అది భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకా రులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు” అని జ‌న‌సేనాని త‌న లేఖ‌లో రాసుకొచ్చారు.