Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Salim: లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

Salim: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్రం లో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (Double bedroom houses)ను లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి మాన్యం చెల్క సీపీఎం శాఖ మహాసభ జరిగింది ముఖ్య అతిధిగా హాజరైన సలీమ్(Salim) మాట్లాడుతూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ పట్టణానికి 552 ఇండ్లు నిర్మాణం చేపట్టారని వారు తెలిపారు. డ్రైనేజీ విద్యుత్తు మంచినీటి సదుపాయం అంతర్గత రోడ్ల నిర్మాణం (Construction of roads)లేకపోవడంతో లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ స్వాధీనం చేయడంలో విఫలమయిందని ఆరోపించారు. నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వలన శిథిలావస్థకు చేరి ప్రజాధనం దుర్యోగం అవుతుందని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి విచారణ చేసి అర్హత కలిగిన పేదలను గుర్తించి వారి లో నుండి లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

అట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీన పరచాలని డిమాండ్ (demnad) చేశారు. లేనియెడల లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి కుటుంబానికి 120 గజాల స్థలం ఇచ్చి కేంద్రం (central)ఐదు లక్షలు,రాష్ట్రం ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాసభ ప్రారం భానికి ముందు సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి కి పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్య మం త్రి బుద్ధదేవ్ బట్టా చార్యకి , సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకు లు పెన్నా అనంతరామ శర్మ మరి యు అమరవీరులకు నివాళు లర్పించడం జరిగింది అనంతరం నూతన శాఖ కార్యద ర్శిగా సీతా వెంకట య్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఊట్కూరి మధు సూదన్ రెడ్డి ఎస్ కె లతీఫ్ యం డి సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు