Chiranjeevi: ప్రజా దీవెన, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్ర ఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటిం చిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి ‘విశ్వంబర’ (Vishwambara)అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మా ణ దశలో ఉంది. విశ్వంబర గ్రాఫి క్స్పై పలు టాప్ వీఎఫ్ఎక్స్ కం పెనీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ భారీ చిత్రా న్ని వెండితెరపైకి తీసుకురావడానికి చిత్రబృందం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.
షూటింగ్, డబ్బింగ్, నిర్మాణానంతర (Shooting, dubbing, post production)కార్యక్రమాలు స మాంతరంగా సాగుతుండగా, సినిమా పూర్తయ్యేలోపు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. జనవరిలో విడుదల చేయా లనే లక్ష్యంతో మేకర్స్ ఈ ఫైనల్ సీక్వెన్స్లను త్వరగా పూర్తి చేయ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనా థ్, రమ్య పసుపులేటి, ఈషా చా వ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషి స్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్ (UV Creations)భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.