Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Breaking: మదనపల్లెలో రూ.80 లకు కిలో టమాటా

Breaking: ప్రజా దీవెన, మదనపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమాటా ధరలు (Tomato prices) క్రమంగా పెరుగుతున్నాయి. బయటి రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గడంతో మదనపల్లె మార్కెట్లో (Madanapalle market) టమాటా ధరలు పెరిగాయి. ఇవాళ ఉదయం ఒకటో రకం టమాటా 10 కిలోల కనిష్ఠ ధర రూ.820, గరిష్ఠ ధర రూ. 880, మోడల్ కాయల ధర రూ.860 పలికింది. ఇక్కడ నిన్న కిలో ధర గరిష్ఠంగా రూ.90 పలికింది. ఇటు బహిరంగ మార్కెట్లో (market) ఏ గ్రేడ్ టమాటా రూ. 90-100, కాస్త తక్కువ రకం రూ.60-70 వరకు పలుకుతోంది.