Gaddam Venkataswamy Jayanti: ప్రజా దీవెన, హైదరాబాద్: దివం గత మహానేత, మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (Gaddam Venkataswamy Jayanti) ( కాకా) జ యంతి సందర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండ ప్రకా ష్ , శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లు (Gutta Sukhender Reddy, Deputy Chairman Banda Prakash, Legislative Affairs Minister Sridhar Babu, Transport Minister Ponnam Prabhakar Goud.) పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నేత గడ్డం వెంకటస్వామి గారన్నారు , ఆయన కార్యకర్త స్థాయి నుండి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారని తెలిపారు. ఎప్పుడు కలిసిన పేద ప్రజల సమస్యల గురించి చర్చించేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఆయన గుర్తుచేశారు. ఆయన వారసులుగా వివేక్ , వినోద్ గార్లు ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణి స్తూ , పేద ప్రజల శ్రేయస్సు కొరకు అనేక సేవ కార్యక్రమాలను నిర్వహి స్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ లు ఎమ్ యస్ ప్రభా కర్ రావు, కోదండరాం , జీవన్ రెడ్డి , దండే విట్ఠ ల్ ,రఘోత్తమ్ రెడ్డి , ఎమ్మెల్యే లు గడ్డం వివేక్ , గడ్డం వినోద్ , మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి , లేజి స్లేచర్ సెక్రెటరీ డా” నర సింహా చార్యులు, తెలంగాణ లేజి స్లేచర్ ఉద్యోగులు తదితరులు కూడా పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.