Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM: మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం

CPM: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైం దని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం ఆరోపిం చారు.ఆదివారం డాక్టర్స్ కాలనీ 43వ వార్డు సిపిఎం (CPM) శాఖా మహా సభ సిద్ధార్థ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో సుమారు 20వేల మంది ఇండ్లు లేని పేదలు నివసిస్తున్నారని వారికి 120 గజాల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం 10 లక్షలు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ (demand చేశారు. పట్టణంలో ఆగిపోయిన బస్టాండ్ నుండి స్టేడియం వరకు, అంబేద్కర్ విగ్రహం నుండి బిటిఎస్ వరకు రోడ్డు విస్తరణ పనులు, విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి వెంటనే పనులు పూర్తి చేయాలని, లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యా వైద్యం (Educational medicine) ప్రజలకు ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు ( basti dispensaries) డాక్టర్లను, సంబంధించిన సిబ్బందిని నియమించాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం దోమలు పెరగి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాసభల ప్రారంభానికి ముందు నటరాజ్ థియేటర్ ఎదురుగా సిపిఎం జెండాను సిపిఎం సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి ఆవి ష్కరించారు. అనంతరం సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury), పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టా చార్య, సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు అనంతరా మ శర్మ, రాసమల్ల రామచంద్రం, శాఖ సభ్యులు గడ్డం రాములు, గనిపెల్లి ముత్తమ్మ, భీమనపల్లి అంజయ్య లకు సంతాపం వ్యక్తం చేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం 43 వ వార్డు శాఖ కార్యదర్శిగా కుంభం కృష్ణారెడ్డి (Kumbham Krishna Reddy) మహిళా శాఖ కార్యదర్శిగా కుంభం లక్ష్మమ్మ తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. 43వ వార్డు సీపీఎం శాఖ సభ్యులు మేక రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహా సభలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ , పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, సలివోజు సైదాచారి, శాఖ సభ్యులు గనిపల్లి రాములు,సల్లోజు విష్ణుమూర్తి, మునెమ్మ, లక్ష్మమ్మ రామకృష్ణారెడ్డి,సాకే వెంకటేశ్వర్లు, గడ్డం వెంకన్న, నాయిని నరసమ్మ, చెరుపలి శివమ్మ, వెంకన్న, గొట్టిముక్కుల పుల్లయ్య ,రేఖల సుగుణమ్మ , గంట్ల నరసింహ, కత్తుల ముత్తయ్య,కలెట్ల వెంకన్న,బట్టు నిర్మల తదితరులు పాల్గొన్నారు