Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CS Shanti Kumari: ఈనెల 10 న ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

–రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సి.ఎస్. శాంతి కుమారి

CS Shanti Kumari: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లోని ట్యాంక్ బండ్ పై దాదా పు పదివేల మంది మహిళలచే ఈ నెల 10 వతేదీన సద్దుల బతుక మ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) తెలి యచేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీ స్ అధికారులు (Police officers) హాజరైన ఈ సమా వేశంలో సి.ఎస్. మాట్లాడుతూ, 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమ రవీరుల స్మారక కేంద్రం నుండి వేలా ది మంది మహిళలు బతు కమ్మ లతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ (Tank bund) పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్బంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ లనుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ల ప్రదర్శన ఉంటుందని పేర్కొ న్నారు.

ఈ బతుకమ్మ ఉత్సవాల (Bathukamma festivals) ను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పా టు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించినట్టు తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరిం చాలని సంబంధిత శాఖల అధి కారులను ఆదేశించా రు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తు న మహిళలు వచ్చే అవకాశ ము న్నందున వారికి ఏవిధమైన ఇబ్బం దులు లేకుండా చర్యలు చేపట్టాల ని ఆదేశించారు. అదేవి ధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లోఉన్న బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డులో (Necklace Road)బతుకమ్మ ల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను కోరారు.

సాయంత్రం 5 .30 నుండి 7 .30 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల (Traffic diversion, barricading, minimum facilities)ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుండి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరా రు. ప్రతీ శాఖ ఒక సీనియర్ అధి కారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సి.ఎ స్ ఆదేశించారు. ఈ సమీక్ష సమా వేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యద ర్శులు వాణి ప్రసాద్, దాన కిషోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు,హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్య దర్శి హరిచందన, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి కాటా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.