Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vigilance investigation: ఆంధ్రప్రదేశ్ లో జగనన్న కాలనీలపై ‘విజిలెన్స్’ ఆరా

–నిర్మాణ సంస్ధల అక్రమాలతో ప్రభుత్వానికి నిలువెల్లా నష్టం
–ఒకే వ్యక్తికి చెందిన 3 కంపెనీలకు కాంట్రాక్టులు, దాదాపు 69 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం
–మెటీరియల్ ధరలు అత్యధికం, బ్లాక్ మార్కెట్ కు నిర్మాణ సామగ్రి
— నామమాత్రo గా నాణ్యతా ప్ర మాణాలు

Vigilance investigation: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న కాలనీలను (Jagananna Colony)నిర్మించిన నిర్మాణ సంస్ధల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం రావడంతో కూటమి ప్రభుత్వం వాటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వీటి నిర్మా ణాల్లో నిర్మాణ సంస్ధలు పెద్ద ఎత్తు న అక్రమాలకు పాల్పడ్డాయని చం ద్రబాబు నాయుడు కూటమి ప్రభు త్వం ఆరోపిస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో జరిగిన స్కాంపై పూర్తి సమాచారం బయటకు లాగ డానికి ప్రభుత్వం విజిలెన్స్ విచార ణకు (Vigilance investigation) ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప టికే విజిలెన్స్ అధికారులు విశాఖ లో ఆప్షన్ 3 కింద చేపట్టిన ఇళ్ల ని ర్మాణ అక్రమాలపై విచారణకు ఆదే శాలు జారీ చేశారు.గత వైసీపీ ప్ర భుత్వంలో ఆ పార్టీ నాయకుల అండదండలతో కొందరు కాంట్రా క్టర్లు పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ తీసు కున్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ నిధులను భారీ మొత్తంలో ఈ నిర్మాణ సంస్ధలు నిధులు దుర్వి నియోగం చేశాయని, వీటి కార ణంగా ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ రేట్ కంటే ఈ నిర్మాణ సంస్ధలు కాలనీల నిర్మాణాలకు వాడిన మెటీరియల్ ధరలు అధి కంగా ఉన్నాయని, వాటి నాణ్యత కూడా సక్రమంగా లేదని ప్రధాన ఆరోపణ.

ఒక్కడికే చెందిన మూడు కంపెనీ లు (Three companies) …రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే వ్యక్తి ఫ్యామిలీకి చెం దిన మూడు కంపెనీలు (Three companies)69 వేలకు పైగా గృహాలు నిర్మిస్తున్నాయి. ఈ కంపెనీలు పేరుకు మాత్రమే మూ డు కంపెనీల అయినా అది ఒకే వ్యక్తికి సంబంధించిన కంపెనీలని, ఒకే వ్యక్తి కుటుంబ సభ్యులు, బం ధువుల పేర్లతో ఈ కంపెనీలు ఏర్పా టు చేశారని విజిలెన్స్ విచారణ అధి కారంలో వెలుగు చూసింది. విశాఖ జిల్లాలోని సుమారు 34 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. విశా ఖ జిల్లాలలోనే ఎక్కువగా ఈ సంస్థ పేదలకు ఇల్లు నిర్మిస్తామని కాంట్రా క్టులు తీసుకున్నారని వెలుగు చూ సింది.వైసీపీ ప్రభుత్వంలో (YCP Govt)అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆశీస్సులతో ఈ కంపెనీలకు పు ష్కలంగా నిధులు విడుదల అ య్యాయని, ఆ విధులకు సం బంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇళ్ల నిర్మాణం ఎత వరకు వచ్చింది అంటూ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ఇసుక, సిమెం టు, కాంక్రీట్, ఐరన్ బయట అమ్మే శారని విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.