Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

L&T Company: భారీ విరాళం… తెలంగాణ ప్రభుత్వానికి ఎల్‌ అండ్ టి రూ.5.5 కోట్లు

L&T Company: ప్రజా దీవెన, హైదరాబాద్‌: వరద బాధితుల సహాయార్థం (aid of flood victims) ముఖ్య మంత్రి సహాయ నిధికి లార్సెన్ అండ్ టూబ్రో( ఎల్‌ అండ్ టి) (L&T Company) సంస్థ 5.50 కోట్ల రూపాయల విరాళం అందించింది. ఎల్‌ అండ్ టి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (cm)వారిని అభినందించారు.