–వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళికలు
–దీర్ఘకాలిక రుణాల వైపు ప్రభు త్వం మొగ్గు
–ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రాక్షర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో మం త్రి ఉత్తమ్ భేటి
Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో కొత్త ప్రాజెక్టులతో (new projects)పాటు కొనసాగుతోన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికై దీర్ఘ కాలిక రుణాలు తీసుకోవడం తో పాటు
దీర్ఘకాలిక ఋణాలతో నీటి పారుదల రంగాన్ని పరుగులు పెట్టిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ(water irrigation department) చేసిన స్వల్పకాలిక ఋణాలతో రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతుంది.
స్వల్ప కాలిక ఋణాలతో ధీర్గకాలిక రుణాలతో పోల్చి చూసినప్పుడు తిరిగి చెల్లించే ఈ.యం.ఐ తో పాటు వడ్డీ మొత్తలలో వెసులు బాటు లభిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని నిర్ణ యించింది.
దీనితో ఆ శాఖా ప్రస్తు తం దీర్ఘకాలిక ఋణాలవైపు మొగ్గుచూపుతుంది.
అందులో భాగంగా మంగళవారం ఎర్రమం జిల్ కాలనీ లోని జలసౌద లోని నీటిపారుదల శాఖా కార్యాలయం లో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రాక్షర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో భేటి అ య్యారు.
ఈ భేటీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహదారుడు ఆదిత్యనాత్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జ ,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇ.యన్.సి లు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఇ.యన్.సి కే.శ్రీనివాస్ లతో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రాక్షర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులు సంగ్మా కిమ్, రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)మాట్లాడుతూ నీటిపారుదల శాఖాకు ప్రస్తుతం ఉన్న స్వల్ప కాలిక రుణాలను సైతం దీర్ఘకాలిక ఋణాలుగా మార్చడం ద్వారా ప్రభుత్వ ఖజానా మీద పడుతున్న భారం తగ్గడంతో పాటు వడ్డీ చెల్లింపులలో వెసులుబాటు ఉంటుందన్నారు.
తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకున్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కొత్త ఆయకట్టు సృష్టించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆ క్రమంలోనే ఈ రుణాలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లకు వర్తింపజేయాలని బ్యాంక్ ప్రతినిధులకు (bank employees)మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
వెనుకబడిన ప్రాంతాలతో పాటు గిరిజనులు అత్యధికంగా ఉన్న ములుగు జిల్లాతో పాటు ఫ్లోరోసిస్ తో బారిన పడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ల పూర్తికి ఈ ఋణాలు వినియోగించేలా చూడాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
యస్.ఎల్.బి.సి, పాలమూరు-రంగారెడ్డి, డిండి లతో పాటు నల్లగొండ, ఖమ్మం, మహాబుబా నగర్ జిల్లా లతో పాటు ఉత్తర తెలంగాణా జిల్లాలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ లకు దీర్ఘకాలిక ఋణాలు ఉపయోగించడం ద్వారా త్వరితగతిన తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతే గాకుండా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రాక్షర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (inspector investment bank)ప్రతినిధులను రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ రావుతో సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాలని నీటిపారుదల శాఖా కార్యదర్శి రాహుల్ బొజ్జాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో అన్ని ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి కార్యాలయం నుండి