Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nara Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…అమరావతి కాదు మునిగింది జగన్ యెలహంకా ప్యాలస్

Nara Chandrababu Naidu: ప్రజా దీవెన, అమరావతి : ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం అమరావతి పనులను (Amaravati works) తిరిగి ప్రారంభించే సమయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరదల్లో రాజధాని అమరావతి మునిగిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (jagan) ఫేక్ ప్రచారం చేశారని, ఆయన దినపత్రిక అయితే వరద బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలపై వార్తలు రాయకుండా, తన నివాసం మునిగిపోయిందని, అమరావతి మునిగిపోయిందని, అందుకే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రుణం ఇవ్వకుండా తిరిగి వెళ్లిపోయారనే అసత్య ప్రచారం చేశారని, ఇప్పుడు వచ్చిన బెంగుళూరు వరదల్లో, ఆయన కట్టుకున్న యలహంకా ప్యాలెస్ (Yalahanka Palace) మునిగిపోయిందని చెప్పారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని, ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే, మనమే నాశనం అవుతామని ఆ విషయాన్ని జగన్ గుర్తంచుకోవాలని రాజధానిలో జరిగిన సభలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ (viral)అవుతోంది.