Erneni Venkataratnam: ప్రజా దీవెన,కోదాడ: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తొలినుంచి సేవలందించే వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు న్యాయం చేస్తున్నారని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం (Erneni Venkataratnam:) బాబు అన్నారు. శనివారం వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు కు జిల్లా గ్రంథాలయ చైర్మన్ (Library Chairman) గా నియామకమైన సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామారావు మొదటి నుంచి పార్టీ కోసం నిరంతరం కృషి చేశాడని వారి సేవలను గుర్తించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) న్యాయం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు.
గ్రంథాలయ చైర్మన్ గా జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలతో పాటు కోదాడ గ్రంథాలయాన్ని (Kodada Library) అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వంటి పులి వెంకటేష్, చందు నాగేశ్వరరావు, నెమ్మాది దేవమణి, లైటింగ్ ప్రసాద్,కాజా మోహినిద్దీన్, వేలాద్రి, సైదిబాబు,వేమూరి విద్యాసాగర్,మైలారి శెట్టి భాస్కర్,ముస్తఫా, వంటి పులి శ్రీను, మేకపోతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.