Gang of thieves : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట పట్టణం లో అర్థరాత్రి దొంగలు హాల్ చల్ చేశారు. మంగ ళవారం తెల్లవారుజామున ఏకంగా మూడు ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారు. పట్టణo లోనీ బాలాజీ నగర్ (Balaji Nagar) కాకతీయ స్కూల్ పక్కన ఇంట్లో 60 వేల రూపాయలు, శ్రీరామ నగర్ లో మూడు తులాల బంగారం (Gold), మరో ఇంటి లో రూ.6 వేల నగదు దొంగిలించారు. ఒకే రోజు మూడు ఇండ్లలో,అలాగే కిరాణం షాపులో, మరో రెండు ఇండ్లలో చోరీ చేశారు.మరో ఇంట్లో దొంగలు (Thieves in the house) ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.60 వేల నగదు అపహరించుకుపోయారు.
కుటుంబ సభ్యులు (Family members)ఇంటికి చేరుకో వడంతో అసలు విషయం తెలి సింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు ఘటనా స్థలంలో పరిశీ లిoచ్చారు.దొంగతనం జరగడంతో ఒక్కసారిగా కాలనీవాసులు ఉలి క్కిపడుతున్నారు.బాలాజీ నగర్, శ్రీరామ్ నగర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తు న్నారు. విలువైన బంగారు నగలు, నగదు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో (Bank locker) ఏర్పాటు చేసుకోవాలని సూచిoచారు.ఒకే రోజు రెండు కాలనీలలో దొంగతనం జరగడంతో పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.