Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sitakka: కేంద్ర ప్ర‌భుత్వం ఎదుట కిష‌న్ రెడ్డి ధ‌ర్నా చేయగలరా

–మూసీకి పైసా తీసుకురాని కిష‌న్ రెడ్డి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి
–బీజేపీ ఈ నెల 25 న త‌ల‌పెట్టిన ధ‌ర్నాను విర‌మించుకోవాల‌ని మంత్రి సీత‌క్క‌ డిమాండ్

Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: గ‌త పదేండ్ల‌లో మూసీ ప్ర‌క్షాళ‌న కోసం గానీ, మూసీ ప్రాంత ప్ర‌జ‌ల సంక్షేమం, ఉపాధి కోసం గానీ న‌యా పైసా కేటాయించ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎదుట కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister Kishan Reddy) , రాష్ట్ర బీజేపీ నేతలు మొద‌ట ధర్నాలు చేయాలని పంచాయ‌తీ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క (Sitakka) డిమాండ్ చేసారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం గుండా మూసీ పారుతున్నా ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఇప్పుడు మూసీ ప్రాంత ప్ర‌జ‌ల త‌రుఫున ధ‌ర్నాకు పిలువుని వ్వ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

మూసీ ప్రాంత ప్ర‌జ‌ల ప‌క్షాన ఈ నెల 25న ఇందిరా పార్క్ వ‌ద్ద బీజేపీ (BJP) త‌ల‌పెట్టిన ధ‌ర్నాను విరమించు కోవాల‌ని సీత‌క్క సూచించారు. మూసీ పరివాహ‌క ప్రాంతంలో ము గ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నం దున‌ కేంద్రంతో చ‌ర్చించి హైద‌రాబా ద్ జీవ‌న రేఖ‌గా భావించే మూసి పున‌రుజ్జీవ‌నం కోసం రూ. ప‌ది వేల కోట్ల ను మంజురు చేయించాల‌ని డిమాండ్ చేసారు. రెండేల్ల క్రితం వ‌ర‌ద‌ల్లో మూసీ ప్రాంత ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు బండికి బండి ఇస్తామ‌ని, ప్ర‌తి ఇంటికి న‌ష్ట‌ప‌రిహా రం అందిస్తామ‌ని హ‌మీ ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం ఒక్క‌రిని కూడా ఆదుకోలేద‌ని మంత్రి సీత‌క్క (Sitakka) గుర్తు చేసారు. ఇప్పుడు మూసీ ప్రాంత అభివృద్దిని అడ్డుకుంటూ బీజేపీ తన నైజాన్ని బ‌య‌ట‌పెట్టు కుంటుంద‌ని ఆరోపించారు.

గుజ‌ రాత్ లో స‌బర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టును స‌మ‌ర్దిస్తున్న బీజేపీ (bjp) ఇక్క‌డ మూసీ అభివృద్ది ప్రాజెక్టును ఎందుకు వ్య‌తిరేకిస్తుంద‌ని సీత‌క్క ప్ర‌శ్నించారు. మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టు స‌క్సెస్ అయ్యి హైద‌రాబా ద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ఎక్క‌డ ఇత‌ర న‌గ‌రాల‌ను దాటిపోతుందో అనే భ‌యం బీజేపీ (bjp) నేత‌ల‌ను వేంటాడుతుందనిఅందుకే మూసి యజ్ఞంను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. నిజం గా మూసీ ప్రాంత ప్ర‌జ‌ల‌ ప‌ట్ల ప్రేమ ఉంటే గ‌త ప‌దేండ్లలో ఎందుకు వారిని ప‌ట్టించుకోలేదని ప్ర‌శ్నిం చారు. మూసీ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు లో ఎక్క‌డా బ‌ల‌వంత‌పు త‌ర‌లిం పులు లేవ‌ని, ప్ర‌జ‌ల స‌మ్మ‌తితోనే వారికి మ‌రో చోట స్థిర నివాసం, ఉపాధి క‌ల్పించిన త‌ర్వాతే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని తెలిపా రు.

అయినా మూసీ పున‌రుజ్జీవ‌న వంటి మంచి కార్య‌క్ర‌మాన్ని అడ్డుకో వ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.గ‌త ప‌దేండ్ల‌లో మూసీ కోసం ఒక్క పైసా కేటాయించ‌లేద‌ని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ (Central Water Resources Department) మంత్రి పార్ల‌మెంటులోనే ప్ర‌క‌టించిన‌ప్పుడు బీజేపీ నేత‌లు ఎందుకు మౌనంగా ఉన్నారని, యూపీఏ హాయంలో మూసీ ప్ర‌క్షా ళ‌న కోసం రూ. 335 కోట్లు మంజూ రు అయితే మోడి పాల‌న‌లో పైసా మంజూరు కాక‌పోయినా ఎందుకు మీరు పెద‌వి విప్ప‌లేదని సీత‌క్క ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోడి ప్రాతి నిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి లోని గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభు త్వం రూ. 11 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందని, ఇత‌ర‌ నదుల ప్రక్షాళన కోసం రు. 6 వేల‌ కోట్ల మంజూరు చేసిందని గుర్తు చేసారు.

కాని మూ సీ ప్ర‌క్షాళ‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వం (Central Govt)పైసా కేటాయించ‌క‌పోవ‌డం తెలం గాణ‌పై కేంద్రం వివ‌క్ష‌త‌కు నిద‌ర్శనం కాదా, ఆ వివ‌క్ష‌త‌ను మీరెందుకు ప్ర‌శ్నించ‌లేదకని సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇందిరా పార్క్ వ‌ద్ద ధ‌ర్నాలు మానుకుని సొంత‌ నియో జ‌క‌వ‌ర్గం గుండా పారుతున్న మూ సీ అభివృద్ది కోసం పైసా తీసుకు రాని కిష‌న్ రెడ్డి (kisan reddy) ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే మంచిద‌ని మంత్రి సీత‌క్క హితవు పలికారు.