–అందుకే మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగింది
–ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకొ ని కూడా కాఫర్ డ్యామ్ను తొలగిం చలేదు
–నిర్మాణ సంస్థ, మాజీ ఈఎన్సీ స హా పదుగురు అధికారులు ఇందు కు బాధ్యులు
— నీటి పారుదల శాఖకు విజిలెన్స్ తుది నివేదిక
Vigilance Final Report: ప్రజా దీవెన, హైదరాబాద్: మేడి గడ్డ బ్యారేజీలో 2019లో నీటిని నింపినప్పుడే బుంగలు ఏర్పడ్డా యని, ఏడో బ్లాకు కింద ఇసుక కొట్టుకుపోవడమే దీనికి కారణ మని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్(Vigilance and Enforce) మెంట్ తేల్చి చెప్పింది. బ్యారేజీని 2019 జూన్లో ప్రారంభించారని, అదే ఏడాది నవంబరులో వరదల తర్వాత బ్యారేజీ దెబ్బతిందని, బ్యారేజీ గేట్లు మూసివేసిన తర్వా త దిగువ భాగంలో కాంక్రీట్ బ్లాకు లు, ఆప్రాన్లు దెబ్బతిన్నాయని, అయినా మూడేళ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ చేపట్టకపోవ డంతో 2023 అక్టోబరులో బ్యారేజీ లోని ఏడో బ్లాకు కుంగిందని స్పష్టం చేసింది.
మూడు బ్యారేజీల వైఫ ల్యాలకు 15 మంది వరకూ అధికా రులు బాధ్యులని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. నిర్దేశిత పద్ధతిలో బ్యారేజీ నిర్మాణ పనులు (Barrage construction works) జరగలేదని, మేడిగడ్డలో కుంగిన బ్లాక్–7కి సంబంధించిన పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్), ర్యాఫ్ట్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ పైల్స్ను కూడా క్రమ పద్ధతిలో నిర్మించలేద ని తేల్చింది. పనులు పూర్తి కాకపో యినా పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేశారని గుర్తు చేసింది. కాళే శ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తుది నివేదికను శనివారం సా యంత్రం 4 గంటల సమయంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
బ్యారేజీల నిర్మాణ పనులు (Construction works of barrages) పూర్తి కాకపోయునా 2019 సెప్టెంబరు 10న దాదాపు పూర్తైనట్లు(సబ్స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్) జారీ చేశారని, పనులు పూర్తికాకున్నా పూర్తైనట్టు ధ్రువీ కరిస్తూ 2021 మార్చి 15న మళ్లీ పనుల పూర్తి ధ్రువీకరణ పత్రం జారీ చేశారని, బ్యాంకు గ్యారంటీల విడుదలలోనూ నిబంధనలు పా టించలేదని నివేదికలో పేర్కొ న్నా రు. ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్ర కారం ప్రతి వర్షాకాలం ముగిసిన తర్వాత డ్యామ్ ఆప్రాన్ ఏరియా లో ‘సౌండింగ్ అండ్ ప్రొబింగ్’ పరీ క్షలు నిర్వహించాల్సి ఉండగా, డ్యామ్ యజమాని (ఈఎన్సీ రామ గుండం) చేపట్టలేదని, బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్ పైల్స్తో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ను (Kaffer Dam) నిర్మాణం పూర్తైన తర్వాత కూడా తొలగించలేదని, ఆ అవశేషాల కారణంగా వరద ప్రవాహం సజా వుగా జరగలేదని వివరించారు. కాఫర్ డ్యామ్ తొలగించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకుని కూడా దానిని తొలగించలేదని, నిర్మాణ సంస్థ తోపాటు రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, సంబంధిత ఎస్ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే ఇందుకు కారణ మంటూ తప్పుబట్టింది.