— సమీక్షలో రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకు ని విద్యుత్ సరఫరాలో ఇబ్బందు లు తలెత్తకుండా ఇప్పటినుండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ పర్యవేక్షిక ఇంజనీర్ వెంకటేశ్వర్లు (SPDCL Supervising Engineer Venkateshwarlu), ఇతర విద్యుత్తు అధికారులతో విద్యుత్ అంశాలపై సమీక్ష నిర్వ హించారు.
వేసవిలో విద్యుత్ (Electricity in summer) సమస్యలను అధిగమించేందుకు నల్గొం డ పట్టణంతో పాటు, నల్గొండ గ్రామీణంలో అవసరమైన సబ్ స్టే షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశిం చారు. అంతేకాకుండా, విద్యుత్తు ఓవర్లోడ్ సమస్య లేకుండా చూసేం దుకు అవసరమైన అదనపు ట్రాన్స్ఫార్మర్లను సైతం ఏర్పాటు చేయాలని, అలాగే ఎక్కడైనా అనుకోకుండా విద్యుత్ సమస్య తలెత్తితే తక్షణమే విద్యుత్తు సరఫరా (Electricity supply) చేసే విధంగా సంచార ట్రాన్స్ఫార్మర్లను సైతం సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ఇతర సామాగ్రి, బడ్జెట్ పై అంచనాలు రూపొందించి తక్షణం తనకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలోనే ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.కాగా వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యపరమైన అంశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ సమస్యలు తీర్చాలని కోరుతూ ప్రజలు మంత్రికి ఫిర్యాదులను సమర్పించారు.విద్యుత్ శాఖ డిప్యూటీ (Deputy Power Deptt) ఇంజనీర్ నవీద్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు