Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana government New cmr polocy : సిఎంఆర్ కొత్త పాలసీకి మిల్లర్ల సహకరిoచాలి

--రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి,పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహన్

సిఎంఆర్ కొత్త పాలసీకి మిల్లర్ల సహకరిoచాలి

–రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి,పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహన్

ప్రజా దీవెన, నల్లగొండ: కష్టం మిల్లింగ్ రైస్ (cmr), ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పాలసీకి మిల్లర్ల సహ కారం అవసరమని రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ ఎస్. చౌహన్ ( civil supplies commisinor chouhon) కోరా రు.మంగళవారం అయన న ల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతి నిధులతో సమా వేశం నిర్వ హించారు.రాబోయే రోజుల్లో మి ల్లింగ్ ఇండస్ట్రీ (Mill ing Indust ry) బలపడాల్సిన అవసరం ఉం దని, రాష్ట్ర ప్రభు త్వం తీసుకు వచ్చిన కొత్త విధానం ( new policy) వల్ల ఇటు రై తులు,అటు ప్రజ లు, మిల్లర్లు అందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సేకరించే ధాన్యం విష యం లో అనేక మార్పులు తీసు కొచ్చిందని, సన్నధాన్యానికి రైతులకు క్విం టాలకు 500 రూపా యల బోనస్ ఇస్తున్నదని, మిల్లింగ్ చార్జీల ( milling charges) ను నాలుగింతలు పెంచడం జరిగిందని, కేవ లం 10 శాతం బ్యాంకు గ్యా రంటీతో సీఎంఆర్ కేటాయించడం జరు గుతున్నదని, పెండింగ్లో ఉన్న మిల్లర్ల మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్ చార్జీలను సాధ్యమైనంత త్వరగా చెల్లించడం జరుగుతుందని తెలి పారు.

సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ( bon us) ఇస్తున్నదని, రెండు కోట్ల 80 లక్షల మంది రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు సన్నబియ్యాన్ని ఇవ్వా లన్నదే రాష్ట్ర ప్రభుత్వ ( stat e government) ఉద్దేశం అని ఇందుకోసం మిల్లర్లు, అధికారు లందరూ అంకితభావంతో పనిచేయా ల్సిన అవసరం ఉందని ఆయ న పిలుపునిచ్చారు. గత 5 సంవత్స రాలుగా పెండింగ్లో ఉన్న 900 కోట్ల రూపాయల ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ( tronsport) ను కేంద్రం నుంచి తీసుకురావడం జరిగిందని, ఇకపై మిల్లర్లకు వచ్చే ప్రతి బెనిఫిట్ ను సకాలంలో అందిస్తామని ఆయన తెలిపారు.

ఖరీఫ్, రబీ సిఎంఆర్ లో నల్గొండ జిల్లా ముందు ఉందని, ఖరీఫ్ 99 శాతం ,రబీ 75% సీఎం ఆర్ పూర్తి చేయటం పట్ల ఆయన అభినం దించారు. తక్కినది కూడా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇకపై మిల్లర్లు సీఎంఆర్ చెల్లింపు లో డిఫాల్ట్ ( defolt) అన్న పదమే రాకుండా చూసుకోవాలని కోరారు. బ్యాంకు గారెంటీ అన్నది కేవలం సీఎంఆర్ వర కు మాత్రమేనని ఎలాంటి బాకీ కి సంబంధం లేదని, మిల్లరు ఎప్పు డు సీఎంఆర్ చెల్లిస్తే అప్పుడు బ్యాంకు గ్యారంటీ విడుదల చేయ డం జరుగుతుందని తెలిపారు.

బ్యాంకు గ్యారంటీ ( bank guara ntee) తో పోలిస్తే మిల్లర్లకు వచ్చే లాభం మూడు శాతం ఎక్కువ ఉందని ఆయన చెప్పారు. మిల్లర్ల కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తా మని తెలిపారు.గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ,ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం సేకరణ నోడల్ అధికారి అనిత రామచం ద్రన్ ( ias Anitha ramachand ran) మాట్లాడు తూ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ చేయాలని కోరారు. రైతు ప్రాధాన్యంగా రైతును దృష్టిలో పెట్టుకొని ఇటు మిల్లర్లు ,అటు అధికారులు కృషి చేయాలని, అన్ని కేంద్రాలలో ట్రాన్స్పోర్ట్ ,ట్రక్స్, తేమ వంటి సమస్యలు లేకుండా పరి ష్కరించాలని, ధాన్యం సేకరణను దగ్గరుండి పర్యవేక్షించాలని కోరా రు.

జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ సన్న రకంధాన్యానికి ఓటీఆర్ నిర్ణయించాలని, పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జెస్ వెంటనే రిలీజ్ చేయించాలని, పెండింగ్ లో ఉన్న ఖరీఫ్ ( kharif),రబీ సిఎంఆర్ చెల్లింపుకు వెసులుబాటు కల్పిం చాలని, ఒకటి రెండు టన్నుల చెల్లించాల్సి ఉన్న 33 మిల్లులను డిఫాల్ట్ (Default is 33 mills) లో పెట్టకుండా వారికి కూడా సీఎం ఆర్ కేటాయించాలని కోరారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్య క్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఓ టి ఆర్ సాధ్యం కానీ పక్షంలో ప్రోత్సా హం ఇవ్వాలని, గతంలో పెండింగ్లో ఉన్న చార్జీలు అన్నిటిని ఇప్పించా లని ,ప్రభుత్వం నుండి పూర్తి సహకారాన్ని కోరుతున్నామని, ప్రభుత్వ సహకారంతో బాయిల్డ్ రైస్, రా రైస్, సిఎంఆర్ డెలివరీ సకాలంలో చేస్తామని, చిన్నచిన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని కోరారు.

అనంతరం కమిషనర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ధాన్యం సేకరణ లో తాలు, తరుగు, తేమ వంటివి ని యంత్రించాలని, ప్రతి ధాన్యం కేం ద్రానికి ధాన్యాన్ని శుభ్రం(Clean the grain for each grain center) చేసే యంత్రాలు ఏర్పా టు చేయాలని, ముఖ్యంగా మెకనై జ్డ్ క్లీనర్లు ఏర్పాటు చేయాలని, ధాన్యం సేకరణ వేగవంతం ( Speed ​​up grain collection) చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించాలని, నిబంధనలకు లోబడి తేమ ఉంటే వెంటనే తరలించాలని, సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా గుర్తించి కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని, లీగల్ మెట్రాలజీ (leagal metrology) అధికారులు కొనుగోలు కేంద్రా లకు వెళ్లి కాంటాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ( collector tripat hi ) మాట్లాడుతూ నల్గొండ జిల్లా రైస్ మిల్లర్లు రాష్ట్రానికే ఆదర్శం గా ఉన్నారని, అడిగిన వెంటనే ప్రభుత్వం విధించిన షర తులతో బ్యాంకు గ్యారంటీకి అను మతించడం జరిగిందని తెలిపారు. అద నపు కలెక్టర్ జె.శ్రీని వాస్ 2024-25 వానకాలం ధాన్యం కొనుగోలుపై వివరాలు సమర్పిం చారు. జిల్లా పౌరస రఫరాల అధికారి వెంకటేశ్వ ర్లు, పౌరసర ఫరాల జిల్లా మేనేజర్ హరీష్, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, ఎల్డిఎం శ్రామిక్, జిల్లా సహకార శాఖ అధికారి పత్య నాయక్ , రైస్ మిల్లర్ల ప్రతినిధులు, ఏపీఎంలు, అసిస్టెంట్ రిజిస్టర్ లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Telangana government New cmr polocy