Telangana household survey : సమగ్రసర్వేలో ఎలాంటి ఆన్లైన్ లింక్ లు ఉండవు
--నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సమగ్రసర్వేలో ఎలాంటి ఆన్లైన్ లింక్ లు ఉండవు
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, నల్లగొండ:సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ( household household survey) సంబంధించి ఎవరు ఓటీపీ ( OTP)లేదా లింకులు ( links) అడగర ని,అలాగే ప్రజలు లింకులు, ఓటీపీ లు చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ( tripathi ) అన్నారు.సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ఆమె నల్గొం డ (nalgonda) జిల్లా దామ రచర్ల మండలం వాడపల్లిలోని లక్ష్మీ పురం, గాంధీనగర్ వీధులలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశా రు.
ఎన్యుమరేటర్లు( Enumerators) సర్వే ఎలా చేస్తున్నారో పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్యుమరేటర్లకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు.అనంతరం ప్రజలతో జిల్లా కలెక్టర్ ( collect or ) మాట్లాడుతూ సమగ్ర కుటుం బ సర్వేకు సంబంధించి ఎవరు ఎ లాంటి ఓటీపీలు గాని, లింకు లు కానీ అడగరని, అందువల్ల ప్రజ లు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఓటిపి లేదా లింకులు చె ప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రభుత్వము నియమించిన ఉపాధ్యాయులు ( teachers) మాత్ర మే గుర్తింపు కార్డులు ధరించి సమాచారం కోసం ఇండ్లకు వస్తారని, సరైన సమాచారాన్ని ఇచ్చి సహ కరించాలని ఆమె కోరారు.సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని వేగ వంతంచేయాలని( Successf ull ) రోజుకు కొన్ని ఇళ్ల చొప్పున కేటాయించుకొని వాటిని పూర్తి చేసేం దుకు ఎన్యు మరేటర్లు, సూపర్వైజర్లు లక్ష్యం నిర్దేశించుకో వాలన్నారు.
అలాగే సర్వే పని నాణ్యతగా (As the quality of survey work) ఉండాలని అన్నారు.ఎక్కడ పొర పాట్లు లేకుండా పూర్తి వివరాలతో సర్వే పారాలను నింపాలని చెప్పారు. ప్రజలు ఎన్యుమ రేటర్లు ఇండ్లకు వచ్చే ముందు ప్రజలు ఆధార్, రేషన్ కార్డు, ధరణి వంటివి ముందే సిద్ధంగా ఉంచుకొని వివరాలు అందిం చాలని కోరా రు. దామరచర్ల తహ సిల్దార్ జవహర్ లాల్, ఎంపీడీవో మూర్తి, వాడ పల్లి స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దినేష్, ఆర్ఐ సు రేందర్, పంచాయతీ కార్యదర్శి శేఖర్ తదితరులు ఉన్నారు.
Telangana household survey