ఘోర రోడ్డు ప్రమాదం, పది మంది దుర్మరణం
ప్రజా దీవెన, మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకోగా బస్సు బోల్తా పడి 10మంది మృతిచెందారు. ఈ ఘటనలో దాదాపు మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ ( bus driver) స్వీ య నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడి ఈ ప్రమాదం జరిగిన ట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీ సులు సంఘటనా స్థలా నికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ( maharastra ) గోండియా జిల్లాలో ని బింద్రవాన తోల గ్రామానికి సమీపంలో కోహ్మరా స్టేట్ హైవేపై ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఇక ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారని గోండియా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గోండియా పోలీసులు వెల్లడించారు.
Road accident