Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm revanthreddy : లగచర్ల లడాయి ముగిసినట్టేనా

--ఫార్మా  భూసేకరణ రద్దు చేస్తూ ప్రకటన

లగచర్ల లడాయి ముగిసినట్టేనా?

ఫార్మా  భూసేకరణ రద్దు చేస్తూ ప్రకటన

ప్రజా దీవెన, హైద‌రాబాద్: రాష్ట్రంలో రాజకీయ రగడకు లగచర్ల లడా యి మూసినట్టేనా అన్న తాజా చర్చ ప్రారంభమైంది. లగచర్ల ఫా ర్మా విలేజ్ భూసేకరణ ఉత్తర్వుల ను ప్రకటన జారీ చేసింది. మొ త్తాని కి ముఖ్య‌ మంత్రి రేవంత్ స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో భాగంగా ఉన్న ల‌గ‌చ‌ర్ల‌లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యాన్ని ప్ర‌భు త్వం ఉపసంహ‌రించుకుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే విడుద‌ల చేసిన భూ సేక‌ర‌ణ నోటి ఫికేష‌న్ ను  శుక్రవారం ర‌ద్దు చేస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డిం చింది. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని పేర్కొం ది. కాగా ల‌గ‌చ‌ర్ల‌లో ఫార్మా విలేజ్ ను ఏర్పాటు ను నిర‌సిస్తూ ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌పై దా డులు కూడా చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 30 మంది వ‌ర‌కు అరె స్ట్ చేశారు. ప్ర‌స్తుతం వారం తా జైలులోనే ఉన్నారు.

దీనిపై బిఆర్ఎ స్ కూడా తీవ్ర నిర‌స‌న తెలి పింది. అక్క‌డి ప్ర‌జ‌ల మ‌ నోభావాల‌కు అనుగుణంగా ఫార్మా విలేజ్ ప్ర‌తిపాద‌న విర‌మించు కో వాల‌ని డిమాం డ్ చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన నిర‌ స‌న దృష్టిలో ఉంచుకుని ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణ‌యాన్ని ఉప సం హ‌రించుకుంది.

Cm revanthreddy