Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Chandrababu Naidu: రూ.10 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా లాక్కున్న ఎమ్మెల్సీ.. ఎవరో తెలుసా

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభు త్వంలో ఆ పార్టీ నేతల దుర్మా ర్గాలు, దురాగతాలపై బాధితులు ఒకొక్కరు వరుసగా బయటకు వస్తు న్నారు. వైసీపీ నేతల అరాచ కాలతో తమకు జరిగిన అన్యా యంపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నారు. బుధ వారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి న ముఖ్యమంత్రికి… తమపై వైసీపీ మూకలు దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది, ఆస్తులు ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకు న్నారనే దానిని బాధితులు వివ రించారు.

తమకు న్యాయం జరిగే లా చూడాలని కోరగా, అన్యాయా లు, అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలు తీసుకుని తక్షణ సాయంగా పలువురికి ము ఖ్యమంత్రి ఆర్ధిక సాయం అందిం చారు. ఇదిలా ఉండగా అధికారా న్ని అడ్డంపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తమ తండ్రిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, నాటి సీఐ రవీంద్ర, ఏసీపీ హను మంతురావుతో బెదిరించి రూ.10 కోట్ల విలువైన తమ ఆస్తులు రాయించుకన్నారని గొల్లపూడికి చెందిన కారెంపూడి అభిరామ్ సీఎంకు ఫిర్యాదు చేశారు.

ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి రవీంద్ర నామినేషన్ వేశారన్న అక్కసుతో లక్ష్యంగా చేసుకుని వేధించి కేసులు పెట్టి 73 రోజులు జైల్లో పెట్టారని వాపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న వారిని తిరిగి ఇవ్వనివ్వకుండా అడ్డుకుని రూ.35 కోట్లు నష్టపోయేలా చేశా రని, ఆర్థిక ఇబ్బందులతో తన తం డ్రి గుండెపోటుతో మృతి చెందారని అభిరామ్ కన్నీటిపర్యంతమయ్యా రు. తలశిల రఘురాంపై విచారణ చేయిస్తే ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో బయటకు వస్తాయని చెప్పారు.

ఆ మంత్రిది అదే దారి…
వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ బెదిరించి మరీ తమ ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని సత్యసాయిజిల్లా, పెనుకొండ మండలం, చంద్రగిరి గ్రామానికి చెందిన జి.మధు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. ఈ ఘ టనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫి ర్యాదు చేయగా నాటి సీఐ శ్రీహరి, ఎస్ఐ భాషా తిరిగి తమనే బెది రించారన్నారు. తనను, తన భా ర్యను నాలుగు రోజుల పాటు స్టేషన్లో ఉంచి తమ ఇంట్లోని రూ.3 8 లక్షల నగదు, ఇతర ఆస్తి పత్రా లు తీసుకెళ్లారని చెప్పుకున్నారు.

తమకు చెందిన కొంత భూమిని ఎస్ఐ, సీఐ అమ్ముకున్నారని, తగిన న్యాయం చేయాలని కోరా రు. చంపావతి నది నుంచి అక్ర మంగా ఇసుక తరలింపును అడ్డు కున్నందుకు 2022లో తనపై వైసీ పీ నేత మైపాడు ప్రసాద్ దాడి చే శారని, తిరిగి తనపైనే కేసులు పెట్టారని నెల్లిమర్లకు చెందిన పి.సురేష్ చెప్పుకొచ్చారు.

అన్న క్యాంటీన్‌కు అండగా విరాళం … అన్నక్యాంటీన్ కు గొల్లపూడికి చెందిన వృద్ధురాలు యలమంచిలి బేబీ సరోజిని రూ. 1 లక్షను విరాళంగా అందించారు. ఎప్పటి నుంచో పొదుపు చేస్తూ వచ్చిన సొమ్మును అన్నక్యాంటీన్‌కు విరాళంగా ఇచ్చానన్నారు. ఈ సం దర్భంగా సరోజినీని సీఎం అభి నందించారు.