ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన
ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. ఈ సoఘట న లో బాద్యురాలు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. వివరాల్లోకి వెళ్తే పోలీసులు ఏడు నెలల కిందట హరీష్కు ఓ యువతి ఫోన్ చేయగా మాటా మాటా కలిసి ఇన్స్టాగ్రామ్లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.
హైదరాబాద్లో చదువుకునే ఆమె వారం లో రెండు రోజులు వాజేడు కు వచ్చి ఉండి వెళ్లేది, ఈ క్రమం లోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఆమె గురించి ఆరా తీసిన హరీష్కు, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెం దిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించ డంతో చిలుకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంద ని విషయం తెలిసింది.దీంతో హరీ శ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయం త్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలో ని ఓ రిసార్టుకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
సెటిల్మెంట్ చేసుకోవడానికి హరీష్ ప్రయత్నించగా, ఇందుకు యువతి ఒప్పుకోకుండా, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతానన డంతో మనస్తాపంతో హరీష్ ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.తమ కుమారుడి మృతి కి ఆ యువతే కారణమంటూ హరీ శ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం తో, ఆమెను పోలీసులు అదుపులో కి తీసుకుని విచారిస్తున్నారు.