ప్రజాదీవెన, నల్గొండ: ఈ నెల 7న నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనలకు వస్తున్న నేపథ్యంలో మల్టీ జోన్-II ఐజి సత్యనారాయణ బ్రాహ్మణ వెల్లంల, యన్.జి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్,మెడికల్ కళాశాల వద్ద సభా ప్రాంగణం పరిశీలించి భద్రతా దృష్ట ఎలాంటి వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సభకు వచ్చే ప్రజలకు,వి. ఐ.లకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు,ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు తదితర భద్రతా ఏర్పాట్లు పై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
ఐ.జి వెంట అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బి డీఎస్పీ రమేష్,నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి, ఎస్బి సిఐ రాఘవరావు,చిట్యాల సిఐ నాగరాజు నల్లగొండ రూరల్ యస్. ఐ సైదా బాబు ఉన్నారు.