Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttamkumar Reddy: నల్లగొండ జిల్లా మంత్రుల శపధం.. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా పెండిం గ్ ప్రాజెక్టులన్ని పూర్తి

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన, పెండింగ్ ప్రాజెక్టుల న్నింటిని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల,పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలి పారు. ఈనెల 7న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సంద ర్భంగా శుక్రవారం అయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నo ప్రభాకర్ గౌడ్ లతో కలిసి నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండ లం బ్రాహ్మణ వెల్లేముల బాలెన్సింగ్ రిజర్వాయర్ ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు పైలాన్ ను, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్ర మాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతిని ధులతో మంత్రి మాట్లాడుతూ బ్రా హ్మణ వెల్లేముల ప్రాజెక్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టు అని ,ముఖ్యంగా కరువు ప్రాంతమై న బ్రాహ్మణ వెళ్లెములకు ఉదయ సముద్రం ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే బ్రాహ్మణవెళ్లె ముల ప్రాజెక్టు గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం బ్రాహ్మణవెళ్లెముల ప్రాజె క్టుకు ఉదయ సముద్రం నుండి బ్రాహ్మణ వెల్దములకు 0.3 టిఎంసి నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు. బ్రాహ్మణ వెల్లేములకు సంబంధించి నిధులు, అనుమతు లు, టెక్నికల్ శాంక్షన్ అన్నింటిని యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తామని, వారం రోజుల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందు కు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకుగాను మిగిలిపోయిన 730 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తు న్నట్లు తెలిపారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగునీరు ఇస్తామని ,ఈ ప్రాంతంలో మొదటి విడుతన 50000 ఎకరాలకు సాగు నీరు రావడం సంతోషించదగ్గ విష యమని తెలిపారు.

తాము ఆధికా రంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రా జెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నా మని, ప్రత్యేకించి నల్గొండ జిల్లా ను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్ బిసీ టన్నెల్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని, ఈ టర్మ్ లోనే ఎస్ఎల్ బిసీ టన్నెల్ పూర్తి చేస్తామని, ఎస్ఎల్ బిసీ ద్వారా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుండి కూడా నీరు తీసుకోవచ్చని,ఎస్ ఎల్ బి సి ద్వారా 3 లక్షల ఎకరాలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించ వచ్చని, ఇటీవల ఎస్ ఎల్ బి సి టన్నెల్లు మిషన్ కు బేరింగ్ ను అమెరికా నుండి తెప్పిస్తున్నామని, ఎస్ ఎల్ బి సి టన్నేల్ పనులు రెండువైపులా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ఎస్ ఎల్ బి సి టన్నేల్ నిర్మాణం పూర్తయితే ఉదయ సముద్రానికి గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. తమ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు గత ప్రభుత్వ కాలంలో అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజక్ట్ పూర్తి కావడం సంతోషంగా ఉందని ,పూర్తి ఎడారి ప్రాంతమైన బ్రాహ్మణ వెళ్లెముల చుట్టుపక్కల 1500 ఫీట్లలో బోర్లు వేసిన చుక్క నీరు పడలేదని, అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టులోకి నీరు వస్తే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అయ్యి 2 పంటలు పండడానికి అవకాశం ఉందని, అలాంటి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రాజెక్టులోకి నీరు రావడం వల్ల చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నామని, దీంతో నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేందుకు ఆస్కారం ఉందని అన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నాల ప్రభాకర్, నకిరేకల్ శాసనసభ్యులు నోముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ,జిల్లా ప్రాజెక్టుల సీఈ అజయ్ కుమార్, సిఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రులు మెడికల్ కళాశాల ప్రారంభం ఏర్పాట్లు, పక్కనే రాజీవ్ ప్రాంగణం లో ఏర్పాటు చెస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.