ప్రజా దీవెన,హైదరాబాద్: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేము లవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడెలు దారి తప్పుతున్నారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదు తో అక్రమాలు వెలుగులోకి వచ్చా యి.
మంత్రి కొండా సురేఖ సిఫార్సు తో రాజన్న ఆలయ కోడెలు పక్క దారి పడుతున్నాయని ఆందోళన చేపట్టారు. మంత్రి సూచన మేరకు ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కోడళ్లను అందజేసినట్లు ఆరోపణలు వచ్చా యి.మంత్రిని మెప్పించడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా కోడళ్లను అప్పగించారనే ప్రచారం సాగుతోం ది. కేవలం రెండు, మూడు కోడెల ను మాత్రమే రైతులకు అందజేసి మంత్రి సూచన మేరకు రాంబాబు అనే వ్యక్తికి ఒకేసారి 49 కోడెలను ఇవ్వడంతో వివాదాస్పదమైంది. కోడెలను టెండర్ ద్వారా పొందిన ట్లు రాంబాబు ఇప్పటికే పోలీసు లకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
49 పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడికి కోడెలను అప్పగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెదూడలను కేటాయించడంపై విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడెల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ కోడెల తరలింపు పై, రాజన్న ఆలయ ఈఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా చేపట్టింది. ఈవోను సస్పెండ్ చేసి,విచారణ చేపట్టాలని అన్నారు. మంత్రి అనుచరులకు రాజన్న కోడెలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రివర్గం నుండి కొండ సురేఖను భర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.