ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ కు వచ్చి కేసీఆర్ పూర్తి చేసిన పనులను ప్రారంభోత్సవాలు చేశారు. ఒక్క రూపాయి కూడా సొంతంగా పనులను చేయలేదు జిల్లా మంత్రులు, కొత్త పనులకు శంకుస్థాపన లు చేసే దమ్ము లేదు కోమటిరెడ్డి ఉత్తమ్ లకి,కేసీఆర్ కలల ప్రాజెక్టు, దేశంలో అతి పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ పాజెక్టు ను మనం కట్టుకున్నాం.
కేసీఆర్ విజన్ ముందు చూపు ఇప్పుడు అందరికి తెలుస్తుంది.2027 నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కి చేరుకోవాలని టార్గెట్ గా పని చేసినం. కేసీఆర్ చేసిన కృషితో పట్టుదలతో యాదాద్రి ప్లాంట్ పూర్తి చేసినం కాంగ్రెస్ పార్టీ అంటేనే శని,కాంగ్రెస్ హయాంలోనే ఫ్లోరైడ్ మహమ్మారి విజృభించింది, అలాంటి మహమ్మరిని కేసీఆర్ భగీరథ నిటితో రూపుమాపారు. ఈ జిల్లా మంత్రి మతిస్థిమితం లేకుండా మాట్లాడాడు యాదాద్రి ప్లాంట్ ను కులగొడతము అని ప్రగల్భాలు పాలికిండు.
అప్పటి ఎన్ జీటీ కేస్ ల లో కోమటిరెడ్డి ప్రమేయం ఉందేమో అని అనుమానం కలుగుతుంది.నిన్న కూడా యాదాద్రి ప్లాంట్ ఓపెనింగ్ ను అడ్డుకుంటాడు అని అనుకున్న కానీ బుద్ది తెచ్చుకొని ఆ పని చేయలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ కు,మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే అవి పూర్తి చేసినం, కేసీఆర్ వ్యవసాయ రంగం పై తీసుకున్న చర్యలతో నల్లగొండ జిల్లా అతి ఎక్కువగా లబ్ది పొందింది.ఇవ్వాళ రాష్ట్ర లో 30 వేల కోట్లు అన్నదాతలకు ఏగ్గొట్టారు, రైతులకు 12 వెల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు.నిన్న రేవంత్ సభలో మాట్లాడుతుంటేనే ప్రజలు సభ నుంచి వెళ్లిపోతున్నారు.అప్పుడు మా కేసీఆర్ వస్తుంటే ప్రజల్లో ఉత్సాహం పెల్లుబికేది రేవంత్ రెడ్డి కి ఎత్తులు ఎక్కువ అయ్యయి.మిము ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుంటున్నాడు.ఉదయ సముద్రం ప్రాజెక్టు ను కూడా మిమే ట్రయల్ రన్ చేసి నీళ్లు ఎత్తి పోసినం దాన్ని మళ్ళీ నిన్న ట్రయల్ రన్ చేసి ,నానా హంగామా చేసి మంత్రి కోమటిరెడ్డి అల్ప సంతోషి ల మాట్లాడుతున్నాడు.
ఇది అంత ప్రజలకు తెలుసు ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు లో టీ బీఎం మిషన్ ను కుట్ర పూరితంగా తెచ్చింది ఎవరు? ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ఎవరో నిను త్వరలోనే చెప్తా వెల్లడిస్తా మూసి ప్రక్షాళన మిమే మొదలు పెట్టినం నల్లగొండ ను సర్వనాశనం చేసింది. కాంగ్రెస్ వ్యవసాయం ను ఆగం చేస్తున్నారు నల్లగొండ కు గోదావరి జలాలను తెచ్చింది కేసీఆర్, ఇవ్వాళ గోదావరి నీళ్లను బంద్ పెట్టారు కాంగ్రెస్ నాయకులు, కాళేశ్వరం తోనే రాష్ట్రంలో ధన్యం దిగుబడులు వచ్చాయి,కాళేశ్వరం గొప్పతనం కాంగ్రెస్ మూర్ఖులకు అర్థం కాదు,జిల్లా ఐదేళ్లు వెనక్కి పోయింది.జిల్లా మంత్రులు దద్దమ్మల్లాగా పలాయనం చిత్తగిస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏంటో వీళ్లకు తెలియదు జిల్లాను దోచుకుంటున్నారు, మంత్రులు జేబులు నింపుకుటూన్నారు.కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు కేసీఆర్ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నారు, రేవంత్ కి కేసీఆర్ అంటేనే వణుకు వస్తున్నది కాంగ్రెస్ మాత అనే విగ్రహంన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు మేము అంగీకరించం కాంగ్రెస్ మాత మాకు నచ్చలేదు ఆ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దు మేము విభేదిస్తున్నాం అన్నారు.