Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fashion Show: అమాత్యుల ర్యాంప్ వాక్ అదుర్స్

ప్రజా దీవెన, న్యూఢిల్లీ, డిసెంబరు 8: కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుకాంత మజుందార్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. శనివారం ఢిల్లీలోని భారతమండపంలో జరిగిన ‘అష్టలక్ష్మి మహోత్సవ్‌’ ఫ్యాషన్‌ షో ఇందుకు వేదికైంది. ఇద్దరు కేంద్రమంత్రులు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా కోట్లను ధరించి ఈ షోలో పాల్గొన్నారు.

ఈశాన్య భారత సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన కోసం ఈ ఫ్యాషన్‌ షోను ప్రధాని మోదీ ఈ నెల 6న ప్రారంభించారు. 8ఈశాన్య రాష్ట్రాల(అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, మణిపూర్‌, మేఘాలయా, సిక్కిం) సంఖ్య వచ్చేలా ఈ ఫ్యాషన్‌ షోకు అష్టలక్ష్మి అని పేరు పెట్టారు.