Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Satyanarayana IPS: సరిహద్దుల వెంట అక్రమ రవాణాఅరికడతాం:మల్టీజోన్_2 ఐజి సత్యనారాయణ ఐపిఎస్

ప్రజా దీవెన, కోదాడ: సరిహద్దుల వెంట అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ రవాణాను అరికడతామని మల్టీజోన్ -2ఐజి సత్యనారాయణ ఐపీఎస్ అన్నారు బుధవారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి రూరల్ సిఐ రజిత రెడ్డి మునగాల హుజూర్నగర్ సిఐలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అలాగే గౌరవ వందనాన్ని స్వీకరించారు, పోలీసుశాఖ అధికారులు ,సిబ్బందితో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలను నాటారు పోలీస్ స్టేషన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు రికార్డ్స్ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని ఆదేశించారు .

సర్కిల్ పరిధిలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన భౌగోళిక మ్యాప్స్ నేరాలకు సంబంధించిన హిస్టరీ షిట్స్ నేరాల నమోదాలను పరిశీలించారు కేసులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు పోలీస్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది అని కార్యాలయంలో రికార్డ్స్ నిర్వహణ, పోలీసింగ్ నిర్వహణ సక్రమంగా జరుగుతున్న అని సిబ్బందిని, CI రజిత రెడ్డి ను అభినందించారు, సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్నంది, సన్న ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నందున మన రాష్ట్రం లోకి ఆంధ్రా నుండి వరిదాన్యం రాకుండా కృషి చేస్తున్నాము అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా పని చేస్తూ ఆంధ్రా వైపు నుండి ఇక్కడికి వరి ధాన్యం రాకుండా రైతులకు అండగా పని చేస్తున్నాము అన్నారు. PDS బియ్యం అక్రమ రవాణా జరగకుండా కృషి చేస్తున్నాము, PDS రైస్ అక్రమ రవాణా పై కేసులు నమోదు చేసి నే నేరుగా బియ్యం స్వాధీనం చేసుకున్నామని, తరచుగా PDS బియ్యం అక్రమ దందా కు పాలడుతున్న నర్సింహారావు, జగదీష్ అనే నిందితులపై PD యాక్ట్ పెట్టడం జరిగినది అన్నారు. PDS బియ్యం దందా చేస్తున్న వారిని గుర్తించి సూర్యాపేట జిల్లాలో ఈరోజు మరో 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము అన్నారు.

ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు నుండి పెద్ద మొత్తంలో వస్తున్న గంజాయి నిరోధించడం, పోలీసు నిఘా బాగా పెరిగి పెద్దమొత్తంలో తరలించే గంజాయి సీజ్ చేస్తున్నందున నేరస్తులు గంజాయిని కొద్ది మొత్తంలో బైక్ లపై తరలిస్తున్నారు ఇలాంటి వారి పై మరింత నిఘా ఉంచాం అన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు. అక్రమ కార్యకలాపాలను, అక్రమ రవాణాను పటిష్టంగా నిర్ములిస్తాం అని ఆయన తెలిపినారు. IG వెంట అధనపుఎస్పీనాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి, మునగాల CI రామకృష్ణా రెడ్డి, హుజూర్నగర్ CI చరమంద రాజు, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, సబ్ డివిజన్ స్టేషన్ ల SI లు, సిబ్బంది ఉన్నారు