ప్రజా దీవెన, అమరావతి: వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి మరో కీలక మాజీమంత్రి రాజీనామా చేయను న్నట్లు మిత్రులతో ప్రచారం జరు గుతోంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో ఆయన రాజీ నామా ప్రకటన చేయనున్నారని తెలి సింది.
2014లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరా రు.మంత్రివర్గంలో చేరి తర్వాత భీమిలీ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో చేరారు. అయితే 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోవడం దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం జగన్ వ్యవహార శైలి నచ్చకనే అని ఆయన సన్ని హితులు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో చేరేది లేదని సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు విశ్వసినీయ సమాచారం.